ప్రభాస్ కథానాయకుడిగా సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ రూపొందుతోంది. 300 కోట్ల బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్తో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్నఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ సినిమాలన్నీ ప్యాన్ ఇండియన్ చిత్రాలు కాగా.. ‘సాహో’ మూవీతో ఇండియన్ స్క్రీన్పై మునుపెన్నడు చూడని యాక్షన్ సీన్స్ను చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే యాక్షన్ సీన్స్కు సంబంధించిన ప్రోమోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 13వ తేదీన ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు.14నుంచి థియేటర్లలో దీన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు యూవీ క్రియేషన్స్ సంస్థ ట్వీట్ చేసింది.
హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారు. అందువలన ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఈ నేపథ్యంలో వస్తోన్న టీజర్ ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి మరి.