దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి .. సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ ఓ క్రేజీ ప్రాజెక్టు తెరకెక్కబోతోంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను నిర్మాత డా.కె ఎల్ నారాయణ భారీ బడ్జెట్తో పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. పదేళ్ల నుంచి మహేశ్బాబుతో మూవీ చేయాలని భావించిన జక్కన్నకు ఇన్నాళ్లకు టైం కుదిరింది.
ఈ సినిమాకు సంబంధి లేటెస్ట్ అప్డేట్స్ బయటకొస్తున్నాయి. కాస్టింగ్ను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ మూవీలో మహేశ్ బాబు సరసన బాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రద్ధాకపూర్ను తీసుకోనున్నారు. సాహోతో టాలీవుడ్కు శ్రద్ధాకపూర్ పరిచయమైంది.
అయితే ఈ మూవీ బాలీవుడ్లో మాత్రమే సక్సెస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత శ్రద్ధాకపూర్కు మళ్లీ తెలుగులో అవకాశాలు దక్కలేదు. ఇప్పుడు ఏకంగా రాజ్మౌళి- మహేశ్బాబు సినిమాలో ఛాన్సు కొట్టేస్తుండటం విశేషం.
Also Read
పుష్ప 2 సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న బన్నీ