- Advertisement -
తెలుగులో రీమెక్ చేసిన హిందీ బ్లాక్ బస్టర్ మూవీ Aashiqui 2 సినిమా వివాదం సచిన్ జోషి, బండ్ల గణేష్ మద్య రాజుకుంటూనే ఉంది. మనీ వివాదంతో మొదలైన ఈ గొడవ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.
తాజాగా సచిన్ జోషి, బండ్ల గణేశ్పై ట్విట్టర్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.” నీ మీద ఒకరికి నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్పినా నిజమే. కానీ అదే నమ్మకం పోయినప్పుడు నువ్వు ఏం చెప్పినా అది కథ లాగా ఉంటుంది తప్ప నిజం అని ఎవ్వరూ నమ్మరు. కాబట్టి నమ్మకమైనా వ్యక్తిగా ఉండు గుడ్ మార్నింగ్,” అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశాడు.
దీనికి బదులుగా సచిన్ జోషి తీవ్రంగా స్పందించాడు. “నీలాంటి మోసగాళ్ళు ఎప్పటికి ఎవ్వరికి నమ్మకస్తులు కాలేరు. నువ్వు మోసగాడి కన్నా సిగ్గు లేని వాడివి.. ఎక్కడ తింటే అక్కడే కక్కే రకం”, అని బండ్ల గణేష్పై సచిన్ జోషి ట్వీట్ చేస్తూ విరుచుకుపడ్డాడు.