Sunday, May 19, 2024
- Advertisement -

మేం ఎక్క‌డికి పోలే.. సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో ఆ సినిమా చేస్తున్నాం..

- Advertisement -

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మవుతున్న మెగా అల్లుడు సాయి ధ‌రమ్ తేజ హీరోగా సినిమా చేయాల‌నుకున్న నిర్మాత మ‌ళ్లీ తేజ్ న‌టించిన సినిమా ఫ్లాపు కావ‌డంతో వెన‌క్కు త‌గ్గాడు. తాను చేయ‌న‌ని ప్ర‌క‌టించి వెళ్లిపోయాడు. ఈ వార్త మీడియాలో చ‌క్క‌ర్లు కొట్ట‌డంతో ఆ సినిమా బృందం రంగంలోకి దిగి సినిమాపై చ‌ర్చ‌లు చేశారు. చివ‌రికి ఏం చెప్పారో ఏమో గానీ ఆ నిర్మాత‌తో సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్‌తో తీయాల‌నుకున్న సినిమాను చేస్తున్న‌ట్లు నిర్మాత పుల్లారావు ప్ర‌క‌టించారు. ‘ఇంటిలిజెంట్’ సినిమా తరవాత తమ నిర్ణయం మార్చుకున్నామని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు. ప్రస్తుతం సాయిధ‌రమ్ తేజ కేఎస్ రామారావు నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నారని ఆ సినిమా పూర్తి కాగానే తమ సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని తెలిపారు.

అయితే ఈ సినిమా విష‌యంలో టెక్నికల్ టీమ్ కూడా ఫిక్స్ అయిందని, యువరాజ్ సినిమాటోగ్రఫీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తారని వెల్ల‌డించారు. మే తరువాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంద‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఇండస్ట్రీలో హిట్, ఫ్లాప్‌లు కామన్ అని, అంతమాత్రన వెనక్కు వెళ్లిపోవడం ఉండదని సూక్తులు చెప్పారు.

సినిమా కథ, తమ ప్రాజెక్టు కాస్ట్ ఇవన్నీ చూసుకుంటాం తప్ప వేరు కాదని, ఈ విషయంలో వినిపిస్తున్న వార్తలు కరెక్ట్ కాదని ఖండించారు. మ‌రీ ఇంత ధైర్యం చేసి సినిమా చేస్తున్నారు.. ఎలా ఉంటుందో ఏమో. ఏది ఏమైనా ఈ సినిమా విడుద‌లై నిర్మాత‌కు, సాయిధ‌ర‌మ్‌తేజ‌కు మంచి జ‌ర‌గాల‌ని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -