- Advertisement -
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఎలాంటి కత్తిరింపులు లేకుండా ‘యూ’ సర్టిఫికేట్ను జారీ చేశారు. నిన్ననే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక పూర్తి చేసుకుంది. కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించాడు.
గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాలో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది.ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.గత కొంత కాలంగా సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో అయిన హిట్ కొడతాడో లేదో చూడాలి.