Wednesday, May 15, 2024
- Advertisement -

ఆ సీన్ కోసం బలవంతగా సాయి పల్లవి ఆ పని చేసిందట

- Advertisement -

ఆంధ్ర ప్రజలను కూడా.. సాయిపల్లవి తెలంగాణ యాసతో ‘ఫిదా’ చేసింది. ఆమె సెప్పిన డైలాగులు గిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమా ఆదరణ పొందుతున్నాయి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి భారీ ఆఫర్లు అందుకోవడం పక్కాగా కనిపిస్తోంది. ఇప్పటికే నాని, శర్వానంద్ సినిమాల సాయి పల్లవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే అందరూ హీరోయిన్ గ్లామర్ గా కనిపించాలని.. అలా కనిపిస్తే చూస్తారని అనుకుంటారు.

కానీ అందుకు బిన్నంగా సాయి పల్లవి మేకప్ లేకుండా నటించి.. అందరినీ ఫిదా చేసింది. ఆమెకి మేకప్ అంటే అసలు ఇష్టముండదట. మేకప్ వేసుకోవడం వల్ల తన అందం పోతుందని.. మేకప్ లేకుంటనే బాగుంటానని అంటుంది. అయితే ఇటివలే ఇచ్చిన ఓ ఇటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. గ్లామరస్‌గా కనిపించేందుకు అస్సలు ఒప్పుకోనని అంటుంది. తనకు గ్లామర్‌ అనే పదమే నచ్చదని నేచురల్‌ ఉండటమే ఇష్టమని అంటుంది.

ఫిదా మూవీలో ఓ సీన్ లో మోకాళ్ల వరకు ఉండే స్కర్ట్‌ వేసుకుంది సాయిపల్లవి. మొదట ఆ డ్రెస్ వేసుకోవడానికి సాయి పల్లవి అసలు ఒప్పుకోలేదట. అయితే ఆ సీన్ కీ ఆ డ్రెస్ వేసుకోవడం చాలా అవరం కావడంతో డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ఆ సీన్‌ ప్రాధాన్యం గురించి చెప్పి.. ఆమెను వేసుకోమని ఒప్పించాడట. అయితే ఇక పై మాత్రం అసలు అలాంటి డ్రెసులు వేసుకోనని.. సాయిపల్లవి తేల్చిచెప్పింది. సో అధి అసలు విషయం.

https://www.youtube.com/watch?v=JAbUjq-V2zU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -