- Advertisement -
హోమ్లీ ఇమేజ్ తెచ్చుకున్న సాయిపల్లవి ఓ బోల్డ్ చిత్రంలో నటించటానికి కమిటైందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.మళయాళ ప్రేమమ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారింది.వెంటనే తెలుగు చిత్ర పరిశ్రమ ఆమెకు ఇక్కడకు దిగుమతి చేసేసింది. ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేసేసింది. ఆ తరువాత ఆమె నటించిన ఎంసీఏ చిత్రం కూడా వర్కౌట్ కావడంతో సాయిపల్లవికి తెలుగులో ఓ రేంజిలో క్రేజ్ వచ్చేసింది.
ప్రమఖ దర్శకుడు మిస్కీన్ త్వరలో ఓ రొమాంటిక్ హర్రర్ థ్రిల్లర్ను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో చాలా హాట్ హాట్ సీన్లు ఉంటాయి అట! పైగా చాలా అడల్డ్ సీన్స్ కూడా ఉంటాయి అని సాయిపల్లవికి ముందే చెప్పారని తెలుస్తుంది.అయిన ఈ సినిమాకు సాయి పల్లవి ఓకే చెప్పటం అనేదే ఆశ్చర్యంగా మారింది.