దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. కరోనా కాటుకు సెలబ్రెటీలు, రాజకీయ నేతలు సైతం కన్నుమూస్తున్నారు. ఇప్పటికే పలువ విషాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత CN రావు మృతి చెందారు. కరోనా కారణంగా ఆయన మరణించడంతో టాలీవుడ్లో విషాదం అలుముకుంది. ప్రముఖ సినీ నిర్మాత CN రావు (చిట్టీ నాగేశ్వరరావు) కోవిడ్ కారణంగా కన్నుమూయడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలుగులో ”మా సిరిమల్లే, అమ్మ నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ” అలాగే తమిళ్లో ఊరగా అనే సినిమాలు నిర్మించారు CN రావు. అంతే కాదు ఆయన ఇండస్ట్రీకి పలు విభాగాల్లో సేవలు అందించారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శిగా, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడిగా, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్కి సెక్రెటరీగా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్గా, ఎక్స్ ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్గా ఆయన సేవలందించారు.