Saturday, May 4, 2024
- Advertisement -

అమ్మ,నాన్నల విడాకుల గురించి చెప్పిన సాయి తేజ్..!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాధించుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇటీవలే ఆయన సాయి తేజ్ గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వు లేని జీవితం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తేజ్.. తర్వాత సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీం వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. తర్వాత వరుస ప్రయత్నాలు చేసినా ఏదీ సక్సెస్ కాకపోవడం తీవ్రంగా నిరాశపరిచింది.

ఆ క్రమంలోనే పేరులో ధరమ్ ని తొలగించి సాయి తేజ్ గా మారాడు. నేమ్ ఛేంజ్ బాగానే కలిసొచ్చింది. వరుసగా రెండు హిట్లు వచ్చాయి. చిత్రలహరి- ప్రతి రోజూ పండగే చిత్రాలతో మంచి విజయాలు సొంతం చేసుకున్నాడు. ఇక ఇదే హుషారులో అతడు సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు ఆగిపోయాయి. అందుకే ఇంట్లోనే ఉంటున్నాడు సాయి తేజ్. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి ప్రస్థావిస్తూ తనను కలతకు గురి చేసిన ఓ ఘటన గురించి చెప్పాడు.

తాను పదో క్లాసులో ఉన్నప్పుడు తల్లి దండ్రులు విడిపోవడం బాధ కలిగించిందని తెలిపాడు. అమ్మా నాన్న మధ్య సరిపడ లేదు. విడాకులు అనివార్యమైంది. అది చేదు జ్ఞాపకం. ఏదేమైనా గతం గతః. అమ్మయినా నాన్నయినా అన్నీ అమ్మే. నన్ను తమ్ముడిని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో ఏ లోటూ రాకుండా పెంచింది. తను ఒక డాక్టర్ ని రెండో వివాహం చేసుకుంది. ఆయన చాలా మంచివారు అని సాయి తేజ్ చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -