- Advertisement -
దేశవ్యాప్తం #మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సంగతి అందరికి తెలిసిందే.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగానే వెల్లడిస్తున్నారు.తాజాగా మరో నటి దర్శకుడు సాజిద్ ఖాన్పై సంచలన ఆరోపణలు చేసింది.గతంలో కూడా ఈ దర్శకుడుపై లైంగిక ఆరోపణలు వచ్చాయి.నటి సలోనీ చోప్రా ఓ జాతీయ దినపత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడుతు షాజిద్ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెబుతూ, నాటి ఘటనను గుర్తు చేసుకుంది.
ముద్దు పెడితే డబ్బులిస్తానని ప్రారంభించిన అతని సంభాషణ, రూ. 100 కోట్లు ఇస్తా అని అడిగేంత వరకూ వచ్చిందని చెప్పింది. తాను గట్టిగా అడిగితే, లైట్లు వేశాడని, అతని కోరిక తీర్చేందుకు తాను మొండిగా నిరాకరించానని, దీంతో తన గొంతు బాగాలేదని, అతిగా ఆలోచిస్తుంటానని చెబుతూ, ముఖ్యమైన పాత్రలకు దూరం చేశాడని ఆరోపించింది.