Monday, April 29, 2024
- Advertisement -

సొంత డబ్బు తో నిర్మాణం లో కి సమంత?

- Advertisement -

సమంత అక్కినేని ప్రస్తుతం ఓ బేబీ అనే సినిమా ప్రచార పనుల్లో బిజీ గా గడుపుతుంది. అయితే ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉండటం తో దొరికిన టైం మొత్తం సినిమా ని బాగా ప్రమోట్ చేయడం లో నే గడుపుతుంది సమంత. అయితే సమంత ప్రస్తుతం రీమక్స్ పైన ధ్యాస పెట్టింది అని తెలుస్తుంది. సమంత నటించిన రాజు గారి గది 2 మలయాళం సినిమా ప్రీతం కి రీమేక్. ఆ తర్వాత సమంత కన్నడ సినిమా యు టర్న్ ని రీమేక్ చేసింది. ఇప్పుడు తాజాగా మిస్ గ్రానీ సినిమా ని రీమేక్ చేస్తుంది. రీమక్స్ అన్ని మంచిగా జరుగుతుండటం, ఫాస్ట్ గా ఫినిష్ అవుతూ ఉండటం తో ఇప్పుడు మరొక రీమేక్ ప్రాజెక్ట్ ని సెట్ చేసే పనిలో ఉంది అని ఫిలిం నగర్ సమాచారం.

తాజా సమాచారం ప్రకారం మలయాళం లో హిట్ అయినా సినిమా ఉయరే ని తెలుగు లో రీమేక్ చేయాలనీ సమంత భావిస్తుంది అని తెలుస్తుంది. సమంత తన సొంత డబ్బు తో అన్నపూర్ణ స్టూడియోస్ బానర్ మీద ఈ సినిమా చేయాలనే ఆలోచన లో ఉంది అని తెలుస్తుంది. సినిమా చాలా బాగుంది అని ఇప్పటికే పబ్లిక్ గా చెప్పిన సమంత ఈ రైట్స్ కొనే విషయం మీద త్వరలో ఒక నిర్ణయం తీసుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -