నటిగా సమంత ఇప్పుడు మంచి ఫామ్ లో కొనసాగుతుంది. నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత అసలు సినిమాల్లో నటిస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ ఈ అమ్మడికి పెళ్లైన తర్వాతనే బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. చైతూని వివాహం చేసుకున్న తర్వాత నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ఈ మద్య రిలీజ్ అయిన జాను కాస్త నిరాశ పరిచింది. వెండి తెరపైనే కాదు ఇప్పుడు బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతుంది సమంత. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు సన్నిధికి టాలీవుడ్ హీరోయిన్ సమంత వెళ్ళారు. తమిళనాడు కోయంబత్తూరు ఔటర్ ప్రాంతంలో ఉన్న ఇషా ఆశ్రమం వద్దకు సమంత వెళ్ళారు. ఆయనతో పలు ఆధ్యాత్మిక అంశాలపై చర్చించారు.
ఆధ్యాత్మిక వేత్త సద్గురు తో ఉన్న ఫోటోను షేర్ చేసిన సమంత ఆ ఫోటోతో పాటు మంచి సందేశాన్ని పోస్ట్ చేశారు. ‘క్రమశిక్షణ సిద్దంగా ఉన్నపుడు సద్గురు కనిపిస్తారు. నీకు నువ్వు గీసుకున్న హద్దులను చెరిపేయడానికి భక్తి బావన కృషి ఉపయోగపడుతుంది. మీ ఇంద్రియాలు మీరు బయట విషయాలను కానీ మీరు అనుభవించే అసలైన విషయాలు లోపలున్నాయని మీరు గ్రహించినపుడు, వచ్చేది జ్ఞానోదయం’ తన మనసులోని భావన షేర్ చేసింది.
ప్లీజ్ ఆ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు : రజినీకాంత్
ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పునః ప్రారంభం.. సిద్ధం అవ్వండి..!
బిజేపి ఎమ్మెల్యే పై దాడి.. కుర్చీకి కట్టేసి కొట్టిన వీడియో వైరల్..!