మన్మథుడు’ సినిమా వచ్చిందంటే టీవీలకు అతుక్కుపోయే వాళ్లున్నారు. సీక్వెల్ అంటే ఎంత కష్టమో ఆలోచించండి. కానీ నాగార్జున ఆ వైపుగా ఆలోచించడమే కాదు.ఇపుడు సినిమాకు సీక్వెల్కు ‘మన్మథుడు 2 కూడా రూపొందుతోంది.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమాలో నాగార్జున కోడలు సమంత ఒక ముఖ్యపాత్రలో నటిస్తోంది. అయితే ఆమె పాత్ర ఎలా వుండనుందనే ఆసక్తి అందరిలోను తలెత్తుతోంది. తాజాగా సమంత పాత్రకు సంబంధించిన వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లోకి తీసుకెళ్లే పాత్రలో ఆమె కనిపించనుందనేది సమాచారం.
మన్మథుడు’ సినిమాలో కథానాయకుడు .. అమ్మాయిలకి ఎందుకు దూరంగా వుంటాడనేది తనికెళ్ల భరణి చెబుతూ ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళతాడు. ఆ పాత్రను ఈ సినిమాలో సమంత చేస్తోందని అంటున్నారు. ‘మన్మథుడు 2’లో కథానాయకుడు అమ్మాయిలతో మాత్రమే చనువుగా ఉంటాడట. అందుకు కారణమేమిటనేది సమంత చెబుతుందని అంటున్నారు. మన్మథుడు2పై భారీ అంచనాలె ఉన్నాయి. మరి అభిమానుల భారీ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది విడుదల అయిన తర్వాత తెలుస్తుంది.