బెంగుళూరులో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆక్సిజన్ కొరతతో పాటు మెడిసిన్స్ కొరత కూడ తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 15 వేలకు పైగా పెరిగింది. ఇదిలా ఉంటే కరోనా కాటుకు సెలబ్రెటీలు విల విలలాడుతున్నారు. తాజాగా కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే తల్లిదండ్రులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.
నా తండ్రికి రెమిడెసివిర్ టీకా అత్యంత అవసరం. ఇప్పుడాయనకు ఆరు ఇంజక్షన్లు అవసరం. దానికోసం ఎంతోమందిని సంప్రదించాను కానీ దొరకడం లేదు. దయచేసి ఇంజక్షన్లను ఇంటికి తెచ్చిచ్చేవాళ్లు ఎవరైనా మీకు తెలిస్తే వెంటనే నాకు మెసేజ్ చేయండి.
నేను ప్రయత్నించిన ఫోన్ నెంబర్లు అన్నీ స్విచాఫ్ అని వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంయుక్త హెగ్డే కోమలి వాచ్మ్యాన్, పప్పీ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించింది. అంతే కాదు హీరో నిఖిల్ సరసన కిర్రాక్ పార్టీలో నటించింది.