Friday, March 29, 2024
- Advertisement -

‘సత్యమేవ జయతే..’ అంటూ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్

- Advertisement -

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ పింక్ సినిమా తెలుగుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌కీల్‌సాబ్‌గా వ‌స్తున్న ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్స్.. లిరిక‌ల్ వీడియో సాంగ్ ల‌తో పాటు ఇందులో క‌థానాయ‌కుడిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తుండ‌టంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

కాగా, ఈ సినిమా ఇప్పిటికే షూటింగ్ పూర్తి చేసుకునీ, విడుద‌ల‌కు ముందు కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ వ‌కీల్ సాబ్‌లోని మ‌రో లిరిక‌ల్ మీడియో పాట‌ను విడుద‌ల చేసింది. “మన తరఫున నిలబడగల నిజం మనిషిరా..” అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం ఆన్ లైన్ లో పంచుకుంది. స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ పాట‌లో అద‌ర‌గొట్టేస్తున్నాడు.

దీనికి త‌మ‌న్ సంగీతం అందించ‌గా… రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. శ్రీ‌రామ్ వేణు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తున్నారు. అలాగే, అంజలి, నివేదా థామస్, అనన్యలు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

పవన్ కల్యాణ్ ఒక స్టేట్ రౌడీ: వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండెక్కిన ఉప్పెన‌ హీరో, హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -