అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సాయేషా సైగల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్గా నిలవడంతో తెలుగులో మళ్లీ ఈ భామకు అవకాశం రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ భాషల్లో సినిమా చేస్తు ఫుల్ బిజీ హీరోయిన్గా మారింది. ఇదే సమయంలో తమిళ లవర్ బాయ్గా పేరు తెచ్చుకున్న ఆర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సాయేషా సైగల్. ఆర్య – సాయేషా సైగల్ పెళ్లి ఘనంగా జరిగింది. తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళ, బాలీవుడ్ ప్రముఖులు కూడా వీరి పెళ్లికి హాజరైయ్యారు.
పెళ్లి కారణంగా సాయేషా తాను నటిస్తున్న సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. పెళ్లి కారణంగా విరామం తీసుకున్న సాయేషా తిరిగి మళ్లీ తన సినిమా షూటింగ్లో పాల్గొంది. తొలిసారిగా కన్నడలో ఆమె పునీత్ రాజ్ కుమార్ సరసన ‘యువరత్న’ సినిమాలో నటిస్తోంది. బెంగుళూరులో జరుగుతోన్న షూటింగులో ఆమె జాయిన్ అయింది. ఈ సినిమాతో పాటు రెండు తమిళ సినిమాల్లో కూడా నటిస్తుంది. సినిమా షూటింగ్ ఇబ్బంది కలుగకూడదని భావించిన సాయేషా తమ హానీమూన్ని కూడా వాయిదా వేసుకుంది. సినిమాల ఒత్తిడి తీరిన తరువాత తన హానీమూన్ని ప్లాన్ చేసుకోనుంది ఈ భామ.