కీర్తి సురేష్ చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ ,తెలుగు రెండు భాషలలో స్టార్ హీరోయిణంగా ఎదిగింది. కీర్తి ఇప్పుడు మహనటి సినిమాలో సావిత్రి పాత్రను పోషిస్తుంది.మొదట ఈ సినిమాలో సావిత్రి పాత్రకు కీర్తి ఎంపికపై చాలామంది దర్శకుడిని విమర్శించారు.కాని సినిమా ఫస్ట్ లుక్ చూసిన వారందరు సావిత్రి పాత్రకు కీర్తినే కరెక్ట్ అనే భావన కలిగించింది.అసలు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలిపింది.
రెండేళ్ల క్రితం కీర్తి ‘తొడరి’ అనే యాక్షన్ థ్రిల్లర్ లో నటించింది.ఈ సినిమాలో డీగ్లామర్ రోల్ చేసింది కీర్తి. ధనుష్ హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్గా నిలిచింది.కాని ఈ సినిమాను చూసిన దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి పాత్రకు కీర్తి బాగా సరిపోతుందని నిర్ణయించుకుని ‘మహానటి’ చిత్రానికి ఆమెను బుక్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి వెల్లడించింది.ఈ సినిమాలో సమంత,విజయ్దేవరకొండ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.ఈ సినిమాలో మేలో విడుదల కానుంది.