- Advertisement -
సినీ నటుడు, రచయిత కాశీ విశ్వనాథ్ కన్నుమూశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్టణానికి వెళుతుండగా రైల్లో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందుతుంది.
కాశీ విశ్వనాథ్ గారు దాదాపు 70 సినిమాలకు రచయితగా పని చేశారు. దాసరినారాయణ రావు, రేలంగి నరసింహరావు, రాజా చంద్ర వంటి ప్రముఖ దర్శకుల దగ్గర రచయితగా పనిచేశారు. హైదరాబాద్ నుండి విశాఖపట్టణానికి వెళుతుండగా ఖమ్మం సమీపంలో గుండెపోటు వచ్చింది.
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తీసుకెల్లాగా అప్పటికే ఆయన మరణించినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేశారు.