Thursday, April 25, 2024
- Advertisement -

వార్ని.. సీరియల్ నటి కూడా మ్యాటర్ అంటూ డైలాగులు వేసిందిగా!

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ద్వారా జబర్దస్త్ కమెడియన్ వివిధ స్కిట్ లో ప్రేక్షకులను అలరింప చేస్తుంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా జరిగే స్కిట్లు పలు వివాదాలకు దారి తీస్తున్నాయి. తాజాగా గత ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది తెలంగాణ యాసను, బతుకమ్మను కించపరిచే విధంగా చేయడంతో హైపర్ ఆది పై పోలీస్ కేసు నమోదయింది.ఈ క్రమంలోనే హైపర్ ఆది క్షమాపణలు కూడా చెప్పారు. ఈ విధంగా ఈ విషయం మరిచిపోకముందే ఈవారం జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ షోలో భాగంగా కమెడియన్ లందరూ జంబలకడిపంబ స్పూఫ్‌లో భాగంగా జబర్దస్త్ కమెడియన్లు రెచ్చిపోయారు. అమ్మాయిలు, అబ్బాయిలుగా అబ్బాయిలు అమ్మాయిలుగా చేసి పచ్చి బూతులతో, డబుల్ మీనింగ్ డైలాగులతో బరితెగించి తెగ నటించేశారు. ఈ స్కిట్ లో భాగంగా హైపర్ ఆది పెయిర్‌గా నటించిన సీరియల్ నటి రీతు చౌదరి పచ్చి బూతులను మాట్లాడుతూ ఎంతో అసభ్యకరమైన పదజాలం ఉపయోగించి స్కిట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also read:నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటూ నటికి ప్రేపోజల్!

ఈ స్కిట్ లో భాగంగా రీతు చౌదరి మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళు పాట పాడుతూ మందు బాటిల్స్ చేతిలో పట్టుకుని తన పెర్ఫార్మెన్స్ ఇరగదీసింది. ఈ క్రమంలోనే ఆదిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇంతమంది ఆడవాళ్లు ఉండగా.. పండటం అవసరమా?’ అంటూ తన మాటల తూటాలు పేల్చింది. ఈ క్రమంలోనే హైపర్ఆది ఆమెను పట్టుకొని మా ఆయనకు అనుమానం ఎక్కువ అంటూ మెడలో తాళి వేసుకొని అంటుండగా అంతలో జీతం చౌదరి వచ్చి ఏం చేస్తున్నావ్ ఇక్కడ అని అడుగగా అందుకే అది అరగంట పాటు మీరు బయటకు వెళ్లి రావాలి అంటే.. నేను బయటకు వెళ్తే నువ్వు ఎవడితో… అంటూ బూతు సైగలు చేసింది. ఈ క్రమంలోనే రీతూ మాట్లాడుతూ నీకు హగ్ ఇవ్వాలి అంటే ఇందాక నీకు మ్యాటర్‌లే .. ఇప్పుడు నాకు మ్యాటర్ ఉంది అని అంటూ విపరీతమైన పచ్చి బూతులతో ఈ కార్యక్రమం సాగనుంది.కేవలం హైపర్ ఆది మాత్రమే కాకుండా మిగిలిన కమెడియన్లు కూడా ఇదే విధంగా ఈ కార్యక్రమంలో చేశారు.

Also read:ఈమెకు 23 మంది భర్తలు.. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -