యంగ్హీరో శర్వానంద్ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. గత లాక్డౌన్ అనంతరం విడుదలైన శ్రీకారం భారీగా కలెక్షన్లు రాబట్టపోయినప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి పేరు తెచ్చుకున్నది. శ్రీకారం సినిమాలోని జానపద పాట.. యువతను ఉర్రూతలూగించింది. శర్వానంద్ ప్రస్తుతం ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతితో మహాసముద్రంలో నటిస్తున్నాడు. అలాగే కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ చిత్రానికి కూడా ఓకే చెప్పాడు.
వీటి తో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తున్న మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో కూడా శర్వానంద్ ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ ఖరారు చేశారు. శర్వానంద్ సరసన రీతువర్మ నాయికగా నటిస్తోంది. అమల అక్కినేని, ప్రియదర్శి, ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తొలిదశ లాక్ డౌన్ కంటే ముందే సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా చివరి షెడ్యూల్ గత యేడాది అక్టోబర్ లో జరిగింది. ఆ తర్వాత కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడంతో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. పెళ్లిచూపులు ఫేమ్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు రాస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
Also Read