బాలయ్యతో శ్రియ మళ్లీ నటించనుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలయ్య ప్రస్తుతం వివి.వినాయక్ డైరక్షన్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా వచ్చే నెలలో ప్రారంభంకానుంది.ఈ సినిమాకు నిర్మాతగా సి.కాల్యాణ్ వ్యవహరిస్తున్నాడు.చెన్నకేశవరెడ్డి తరువాత వివి.వినాయక్-బాలయ్య కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై అప్పుడే హైప్ క్రియేట్ అయింది.వినాయక్ వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి తన మూనపటి ఫాంను అందుకొవలని చూస్తున్నాడు.
బాలయ్య కూడా ఎన్టీఆర్ బయోపిక్ పక్కన పెట్టి మరి ఈ సినిమా తీస్తున్నాడు.మరి ఈ సినిమాలో బాలయ్య పక్కన శ్రియని సంప్రదించారని,శ్రియ కూడా బాలయ్య పక్కన అయితే ఒకే అన్నట్లు సమాచారం. ఇదే గనుక నిజం అయితే బాలయ్య పక్కన నాల్గోవ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది.అంతకముందు చెన్నకేశవరెడ్డి,గౌతమిపుత్రశతకర్ణి,పైసా వసూల్ సినిమాలలో బాలయ్య పక్కన హీరోయిన్గా చేసింది.ఇంతకముందు బాలయ్యతో నాలుగు సినిమాలలో హీరోయిన్గా చేసినవారు లేరు.పైగా బాలయ్యతో వరుసగా మూడు సినిమాలలో హీరోయిన్గా చేస్తేంది. శ్రియ.పెళ్లి తరువాత శ్రియ చేస్తున్న మొదటి సినిమా కావడం ఇదే.