Wednesday, May 15, 2024
- Advertisement -

శింబు ఇప్పుడు పిచ్చ హ్యాపీ

- Advertisement -

బీప్ సాంగ్ తో తలబొప్పికట్టించుకున్న తమిళ తంబి శింబు ఇప్పుడు డబుల్ హ్యాపీగా ఉన్నాడు. ఒకేసారి రెండు గుడ్ న్యూస్ లు వచ్చాయి శింబుకి. అందులో ఒకటి తన కేసుకు సంబంధించినదైతే.. మరొకటి తన కొత్త సినిమా గురించి.

బీప్ సాంగ్ కేసులో శింబుకి మద్రాస్ హైకోర్టు ఊరట ఇచ్చింది. కోయంబత్తూర్ కోర్టులో హాజరై.. బెయిల్ పొందొచ్చని సూచించింది. దీంతో కేసు కష్టాలు ప్రస్తుతానికి తగ్గినట్టే. దీంతోపాటు కేసు పెట్టిన వారు మెల్లమెల్లగా విత్ డ్రా చేసుకుంటుండడం కూడా శింబుకి కలిసొస్తోంది.శింబు తలపై పానకం పోసేంత తీపి వార్త ఏంటంటే.. తన కొత్త సినిమా సాంగ్ సూపర్ హిట్ అయింది.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న అచ్చెం యెంబతు మాదమియదే అనే సినిమాకి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘తల్లి పోగత్తే’ పాట విడుదలై తమిళనాట దుమ్మురేపుతోంది. ప్రతి ఒక్కరూ బీప్ సాంగ్ ను మర్చిపోయి.. ఈ కొత్త పాటను అందుకున్నారు. దీంతో ఆనందమానంద మాయే అంటున్నాడు శింబు తంబి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -