Friday, May 10, 2024
- Advertisement -

స్టార్ హీరో ని సినిమా లో నుంచి తీసేసిన నిర్మాత

- Advertisement -

మానాడు అనే ఒక ఆసక్తికరమైన సినిమా లో శింబు నటించనున్నాడు అనే వార్తలు కొన్ని రోజుల క్రితం హల్చల్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి శింబు వైదొలిగినట్లు ఈ సినిమా నిర్మాత సురేష్ అధికారికం గా ప్రకటించారు. ఈ సినిమా క్రమక్రమం గా డిలే అవుతూ వస్తుందని, అది నచ్చని అతను శింబు ని సినిమా లో నుంచి తీసేసినట్లు తెలిపాడు. అయితే ఇదంతా సంతృప్తికరం గా నే జరిగిందని, శింబు కి అతని అభిమానులకి ధన్యవాదాలు తెలిపారు నిర్మాత.

ఇప్పుడు మరొక హీరో ని తీసుకొని ఈ సినిమా యొక్క షూటింగ్ ని త్వరలో మొదలు పెట్టాలని నిర్మాత భావిస్తున్నట్లు సమాచారం. వెంకట్ ప్రభు ఈ సినిమా కి దర్శకత్వం చేయనున్నారు. అయితే నిజానికి ఈ సినిమా చేయడానికి కావాల్సిన డబ్బు నిర్మాత దగ్గర లేదని, శింబు కూడా ఫండ్స్ ఎరేంజ్ చేయడం లో విఫలమయ్యారని, అందుకే వేరే హీరో వైపు ప్రొడ్యూసర్ మొగ్గు చూపారని సమాచారం.

ఈ సినిమా ఇంతకీ మొదలవడం లేదని వెంకట్ ప్రభు హాట్ స్టార్ కోసం ఒక వెబ్ సిరీస్ చేయాలని అటు వైపు వెళ్లిపోయారు. ఇక ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -