Tuesday, April 30, 2024
- Advertisement -

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ సింగ‌ర్ మృతి

- Advertisement -

రోడ్డు ప్ర‌మాదంలో ప్ర‌ముఖ సింగ‌ర్ మృతి చెందింది. బీహార్‌కు చెందిన పాప్ సింగర్ శివానీ భాటియా రెండు రోజుల క్రితం కారు ప్ర‌మాదంలో గాయ‌ప‌డింది. యూపీలోని మధుర జిల్లాలో ఓ ట్రైన్‌ను ఓవర్ టేక్ చేయ‌బోయి శివానీ భాటియా కారు అదుపు త‌ప్పి బోల్తా పడింది. ఈ ప్ర‌మాదంలో శివానీ భాటియా భ‌ర్త నిఖిల్ కారు న‌డుతున్న‌ట్లు తెలిసింది.కారులో శివానీ కూర్చున్న వైపు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. అక్క‌డే ఉన్న స్థానికులు వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

అక్కడ చికిత్స పొందుతూ శివానీ బుధ‌వారం కన్నుమూసింది. ఆమె భర్త నిఖిల్ ఆరోగ్యం మెరుగ్గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు. బీహార్‌కు శివానీ భాటియా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో మంచి సింగ‌ర్‌గా పేరు తెచ్చుకుంది. చాలాచోట్ల ఆమె జ్ షోలు కూడా ఇచ్చింది. ఆమె మృతితో రెండు రాష్ట్రాల‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.ఆమె మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=UFP6ZPWSDW8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -