Friday, May 17, 2024
- Advertisement -

రూ.ప‌దితో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు కోట్లు తీసుకుంటున్న హీరోయిన్‌

- Advertisement -

దక్షిణాది సినిమా ప‌రిశ్ర‌మ‌లో అగ్ర తార‌గా ఎదిగిన హీరోయిన్ బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ టాప్ హీరోలంద‌రితో న‌టించి మెప్పించిన ఆమె ఇప్పుడు రాజ‌కీయాల్లో బిజీ అయిపోయారు. అయితే ఆ హీరోయిన్ తొలి సంపాద‌న‌గా రూ.10 అందుకుంద‌నే విష‌యం కొంత‌మందికే తెలుసు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఏకంగా రూ.2, 3 కోట్లు వ‌సూల్ చేసేంత స్థాయికి ఎదిగారు. ఆవిడ ఎవ‌రు అనుకుంటున్నారా? అల‌నాటి న‌టి జ‌య‌ప్ర‌ద‌.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌మండ్రికి చెందిన జ‌య‌ప్ర‌ద తెలుగులో సినీరంగ ప్ర‌వేశం చేశారు. బాల్యంలో నేర్చుకున్న నృత్యంతో జయప్రద హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించ‌డానికి పునాది వేసింది. జ‌య‌ప్ర‌ద 14 ఏళ్ల వయసులో పాఠశాలలో జరిగిన ఒక నృత్య ప్రదర్శనలో పాల్గొంది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను చూసిన ఒక దర్శకుడు ‘భూమి కోసం’ సినిమాలో జ‌య‌ప్ర‌ద‌కు అవకాశం ఇచ్చారు. అయితే ఆ సినిమాలో మూడు నిమిషాల పాటు ఉండే నృత్యం జ‌య‌ప్ర‌ద చేస్తూ క‌నిపిస్తుంది అంతే. ఈ సినిమాలో ఆమె నృత్యానికి ప్రతిఫలంగా జయప్రద 10 రూపాయలు తీసుకున్నారు. అదే జ‌య‌ప్ర‌ద కెరీర్‌లో తొలి సంపాద‌న‌. ఆ త‌ర్వాత జ‌య‌ప్ర‌ద 1976లో ‘అంతులేని కథ’ సినిమాతో తిరుగులేని నటిగా ఎదిగారు. తరువాత ‘సిరిసిరి మువ్వ’, ‘సీతా కల్యాణం’, ‘సాగ‌ర సంగ‌మం’ తదితర సినిమాలతో ప్రేక్షకులను అమితంగా అలరించారు.

ఆ త‌ర్వాత 1979లో జయప్రద బాలీవుడ్‌లోకి వెళ్లి టాప్ హీరోల‌తో జ‌త‌క‌ట్టి మంచి సినిమాల్లో న‌టించారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి వెళ్లి బిజీ అయిపోయారు. మ‌ళ్లీ రీ ఎంట్రీ కోసం జ‌య‌ప్ర‌ద ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇంత‌కు ఈ విష‌యం ఎందుకు చెబుతున్నామంటే ఏప్రిల్ 3వ తేదీ జ‌య‌ప్ర‌ద పుట్టిన రోజు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజమండ్రిలో 1962 ఏప్రిల్ 3వ తేదీన జయప్రద జ‌న్మించారు. ఆమె అసలు పేరు లలితా రాణి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -