టాలీవుడ్ వివస్పద నటి శ్రీరెడ్డి మరో కొత్త వివాదానికి తెర లేపింది.టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి , ఆ తరువాత పలువురు టాలీవుడ్ ప్రముఖులపై వివాస్పద వాఖ్యలు చేసి విమర్శల పాలైంది.తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు కోసం పడుకోవాలని ,ఇక్కడ పడుకుంటేనే అవకాశాలు ఇస్తారని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది.ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదన్శన చేసి వార్తల్లో నిలిచింది శ్రీరెడ్డి.
ఇక టాలీవుడ్ బడా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తాననిన చెప్పి లైంగికంగా వాడుకున్నాడని చెప్పి సంచలనానికి తెరలేపింది.శ్రీరెడ్డి ఆధారాలు లేని ఆరోపణలు చేయడంతో ఇక్కడ మీడియా పట్టించుకోవడం మానేశారు.దీంతో తమిళ ఇండస్ట్రీ షిఫ్ట్ అయి అక్కడ ప్రముఖులపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది.తాజాగా శ్రీరెడ్డి సినిమా వాళ్లను దాటుకుని క్రికెటర్స్ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.క్రికెట్ గాడ్ అయిన సచిన్పైనే విమర్శలు చేసింది శ్రీరెడ్డి.సచిన్ టెండూల్కర్ చాలా రొమాంటిక్ వ్యక్తి.
ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ‘ఛార్మిం’గ్ గర్ల్ ఆయనతో రొమాన్స్ చేసింది. పెద్ద మనిషిగా పేరున్న చాముండేశ్వరి స్వామీ ఈ రొమాన్స్కి మధ్యవర్తి. గొప్ప వ్యక్తులు బాగా ఆడతారు. నా ఉద్దేశం బాగా రొమాన్స్ చేస్తారు” అంటూ పోస్ట్ పెట్టింది. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి. ఎందుకంటే ఇందులో శ్రీరెడ్డి ప్రస్తావించిన పేర్లు సమాజంలో ప్రముఖులుగా చెలామణి అవుతున్న వారే.