Friday, March 29, 2024
- Advertisement -

శ్రీనివాస్‌రెడ్డి హీరోగా కొత్త ‘జంబలకిడి పంబ’ వ‌స్తోంది.. 

- Advertisement -

‘గీతాంజలి’, ‘జయమ్ము నిశ్చయమ్మురా’ విజ‌య‌వంత‌మైన సినిమాల‌తో శ్రీనివాసరెడ్డి హీరోగా గుర్తింపు పొందాడు. మంచి సినిమాల‌తో ఫీల్‌గుడ్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. క‌మెడియ‌న్‌గా రాణిస్తూనే ఇటు హీరోగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. దీనికి ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 1993లో విడుద‌లైన ‘జంబలకిడి పంబ’ సినిమాను మ‌ళ్లీ తీసుకొస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ వివ‌రాల‌ను చిత్ర బృందం వెల్ల‌డించింది.

‘జంబలకిడి పంబ’ సినిమా ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది. ఆ స‌మ‌యంలో బంప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను మ‌ళ్లీ అదే పేరుతో ‘జంబలకిడి పంబ’ తీయ‌నున్నార‌ట‌. జె.బి. మురళీకృష్ణ (మను) దర్శకత్వంలో శివమ్‌ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘‘రొమాంటిక్‌ కామెడీ సినిమా ఇది. వైకుంఠ ఏకాదశి రోజున మా సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాం. మార్చి 10వ తేదీ వరకు నిరవధికంగా షూటింగ్ చేస్తాం’’ అని తెలిపారు. ‘‘మా సినిమాకు చక్కగా సరిపోయే టైటిల్‌ ‘జంబలకిడి పంబ’. టైటిల్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు’’ అని ద‌ర్శ‌కుడు మురళీకృష్ణ చెప్పారు.

ఈ సినిమాలో సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రల్లో నటించ‌నున్నారు. సంగీతం: గోపీసుందర్, కెమెరా: సతీశ్‌ ముత్యాల, సహ నిర్మాత: బి.సురేశ్‌ రెడ్డి, లైన్‌ ప్రొడ్యూసర్‌: సంతోశ్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -