టాలీవుడ్ సంచలన నటి మరో వివాదానికి తెరలెప్పింది.ఒక్కప్పటి హీరోయిన్ ఇప్పటి ఎమ్మెల్యే రోజాపై వివాస్పద కామెంట్స్ చేసింది.తెలుగు ఇండస్ట్రీ కాస్టింగ్ని తెర మీదకి తెచ్చి ఈ ఉద్యమాన్ని తార స్థాయికి తీసుకువెళ్లింది.ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడే నటుడు పవన్ కల్యాణ్,ఆయన తల్లిపై చేసిన కామెంట్స్తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.అప్పటివరకు ఆమె సపోర్టు చేసిన వాళ్లందరు ఆమెకు దూరం అయ్యారు.మీడియా కూడా ఈమె విషయంలో సైలెంట్ అయింది.
శ్రీరెడ్డి కూడా బయట ఎక్కడ కనిపించలేదు. కొన్ని రోజుల క్రితం మా సభ్యత్వ రుసం కట్టిన శ్రీరెడ్డి మళ్లీ తన ఫేస్బుక్లో కామెంట్స్ చేయడం మొదలు పెట్టింది.నిన్న(ఆదివారం) ఎమ్మెల్యే రోజా హీరో రాజశేఖర్ మీద చేసిన ఆరోపణలపై స్పందించారు.రాజశేఖర్ అలాంటి వారు కాదని , ఒకవేళ రాజశేఖర్ అలాంటివారైతే ఆయన మీద చేసిన ఆరోపణలు నిజమని తేలేవని చెప్పుకొచ్చింది.ఆయనతో నేను రెండు సినిమాలు చేశానని ఆయన చాలా మంచివారని తెలిపారు రోజా.దీనిపై నటి శ్రీరెడ్డి రోజా మీద తన ఫేస్బుక్లో కామెంట్స్ చేసింది.
రోజా గారు, మీరు బాగానే కవర్ చేశారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదా..? వాయమ్మా.. 27 ఏళ్లు అయ్యిందట ఆమె ఇండస్ట్రీకి వచ్చి. ఆమెను ఎవరూ కెలకలేదట. వాహ్వా, వాహ్వా.. మీరు ఎవరికీ నచ్చలేదమో కొంపదీసి?? బురద వేశానా తల్లి ఇండస్ట్రీ మీద?? మొత్తం ఇండస్ట్రీ రిపోర్ట్ రెడీ అవుతోంది. నాతో వద్దమ్మా నీ లొల్లి’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేసింది.మరి దీనిపై ఫైర్బ్రాండ్ రోజా ఏవిధాంగా స్పందిస్తారో చూడాలి.ఇండస్ట్రీలో పెద్దలు చాలామంది శ్రీరెడ్డిని లైట్ తీసుకున్నారు. మరి ఈ ఇష్యూ ఎంతవరకు వెళ్లుతందో చూడాలి.