బాహుబలి విడుదల తర్వాత ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కేవలం పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నాడు ప్రభాస్. అందులో భాగంగానే.. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై రాధేశ్యామ్ చిత్రంలో నటించేందుకు ఒప్పుకున్నాడు. పిరియాడికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాధిత్యగా కనిపిస్తున్నాడు. ఇక ప్రేరణ అనే యువతి పాత్రను పూజా హెగ్డే చేస్తోంది.
హాలీవుడ్ రేంజ్ లో ఓ గొప్ప ప్రేమకథగా ఈ చిత్రం నిలిచిపోతుందట. ఇక ఈ మూవీ కోసం ఫ్యాన్స్, సినీ జనాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఈ మోషన్ పోస్టర్కు ఇప్పటివరకు 21 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతవరకు ఏ భారతీయ సినిమా ఈ స్థాయి వ్యూస్ సాధించలేదు. ఇండియన్ సినిమా విషయంలో ఇదో రికార్డు అని చెబుతోంది చిత్ర యూనిట్.
ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎప్పటికి కంప్లీట్ అవుతాయి? సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? అనే విషయంపై మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్తో ఆదిపురుష్లో, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత నాగ్ అశ్విన్తో మరో ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటించబోతున్నాడు ప్రభాస్.
Also Read