తెలుగు సినిమా కొత్త పంథాలో నడుస్తున్నట్లు అనిపిస్తుంది.అర్జున్ రెడ్డి సినిమా తెలుగు సినిమా చరిత్రను మొత్తం మార్చేసింది.ఇక ఈ సంవత్సరం విడుదలైన చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటాయి.ఆర్స్ఎక్స్ 100,గూఢచారి,చి లా సౌ, వంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి.దీంతో తెలుగులో విభిన్న కథలు తెరకెక్కుతున్నాయి.తాజాగా అలాంటి సినిమానే ఒకటి బయటికి వచ్చింది.
‘కేరాఫ్ కంచరపాలెం’ అనే సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ దర్శక ధీరుడు రాజమౌళికి తెగనచ్చేసిందటా.సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తు…ట్రైలర్ చూసిన 10 రోజుల తర్వాత కూడా ఆ పాత్రలు మనను వెంటాడుతున్నాయంటే ఆ సినిమా మన మనసుకు హత్తుకున్నట్లేనని చెప్పాడు. తనపై ‘కేరాఫ్ కంచరపాలెం’ అటువంటి ప్రభావం చూపిందని కితాబిచ్చాడు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో అందరూ నూతన నటీనటులే నటించడం విశేషం. ఇక ఈ సినిమాను హీరో రానా తమ నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్నాడు.