Friday, May 3, 2024
- Advertisement -

మూడు రోజుల రాజమౌళి కొడుకు పెళ్లికి సర్వం సిద్దం..

- Advertisement -

టాలీవుడ్ దిగ్గ‌జ దర్శకుడు రాజమౌళి ఇంట భాజా, భ‌జంత్రీలు మోగ‌నున్నాయి. రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం డిసంబర్ 30న జైపూర్ లో జరగనుంది. ఇప్ప‌టికే రాజమౌళి కుటుంబం జైపూర్‌కు చేరుకుని పెళ్లి ప‌నుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి మూడు రోజుల‌పాటు జ‌ర‌గ‌నుంది.

జగపతిబాబు అన్నయ్య కూతురు పూజా ప్రసాద్ తో కార్తికేయ వివాహం జరగనుంది. అతిథులంద‌రూ ఒక్కొక్క‌రుగా జైపూర్ చేరుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం వెల్కం డిన్నర్ తో మొదలై, రేపు మెహంది.. సంగీత్.. జరిపి డిసంబర్ 30న వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు.

అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వేడుకకు 300 మందికి పైగా అతిథులు హాజరుకానున్నట్లు సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు తమ ఫ్యామిలీస్ తో జైపూర్ చేరుకున్నారు. వారితో పాటు ప్రభాస్, అనుష్క శెట్టి, సుస్మితా సేన్‌తో పాటు టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, బడా నిర్మాతలు, దర్శకులు ఈ పెళ్లికి హాజరుకానున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -