సినిమాటోగ్రఫీ చట్టం -1952ను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైతే మళ్లీ ఆ చిత్రాన్ని ఆపేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే కేంద్రం నిర్ణయాన్ని పలువురు బాలీవుడ్ దర్శకులు, నటులు వ్యతిరేకించారు.
తాజాగా టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఈ మేరకు ఆయన వరస ట్వీట్లు పెట్టారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అసలు సెన్సార్ బోర్డుకు ఏ విలువ ఉండదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇష్టంలేని సినిమాలు బయటకు రాకుండా ఆపుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read:పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న దర్శకుడు..!
‘కేంద్రం ఎటువంటి సినిమాలు రావాలనుకుంటే అటువంటి సినిమాలు మాత్రమే బయటకు వస్తాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతం కలిగిస్తుంది. సీబీఎఫ్సీ ఉండి ప్రయోజనం ఏమిటి? కథకులు, సృజనకారులు తమ స్వేచ్చను కోల్పోతారు’ అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఇంతకీ పవన్ సినిమాలో హీరోయిన్ ఎవరూ?