ఈ టీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్ షో ఎంత ఫేమస్ అయిందో, అందులోని టీం లీడర్ సుడిగాలి సుధీర్ కూడా అంతే ఫేమస్ అయ్యాడు.బుల్లితెర మెగాస్టార్గా అందరి ప్రశంసలు పొందుతున్న సుధీర్ ,పలు టీవీ షోలకి వాఖ్యాతగా వ్యవహరిస్తు తనకంటు ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.తాజాగా అతను యాంకర్ సుమ నిర్వహించే క్యాష్ ప్రొగ్రాంకు గెస్ట్గా వెళ్లాడు.అక్కడ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తన ప్రేమ గురించి చెబుతు కన్నీరు పెట్టుకోవడం చూసి ,షోలో ఉన్నవారంతా ఎమోషనల్ అయ్యారు.సుధీర్ 12 ఏళ్ల పాటు ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాడట.కానీ అమ్మాయి అతడిని వదిలేసి మరెవరినో పెళ్లి చేసుకోవడంతో ఆ బాధ నుండి రావడానికి చాలా సమయం పట్టిందని తన లవ్ స్టోరీ చెప్పుకొచ్చాడు.
‘ఐదో తరగతి చదివే సమయంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. తొమ్మిదో తరగతి వచ్చేసరికి తను కూడా నన్ను ఇష్టపడింది. అలా పన్నెండేళ్ల పాటు మా ప్రేమ కొనసాగింది. నేను హైదరాబాద్ కి వెళ్తున్నాను సెటిల్ అయి వస్తాను అని ఆ అమ్మాయికి చెప్పి వచ్చాను. తను కూడా నీకోసం ఎదురుచూస్తుంటానని చెప్పి పంపించింది.ఒకరోజు ఫ్రెండ్ ఫోన్ చేసి ఆ అమ్మాయికి పెళ్లైంది లవ్ మ్యారేజ్ అంట అని చెప్పాడు. నేను ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఇలా ఎందుకు చేశావని అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను.. నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది’ అంటూ చిన్నప్పటి తన ప్రేమ విఫలమైందని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక ఈ ప్రొగ్రాంకు సుధీర్తో పాటు అడవి శేష్,హీరోయిన్ ప్రియమణి,మంచు లక్ష్మి కూడా గెస్ట్లుగా వచ్చారు.ఈ ప్రొగ్రాం వచ్చే శనివారం ప్రసారం కానుంది.
https://www.youtube.com/watch?v=h8RZ3Nz9Zns