- Advertisement -
కమెడీయన్గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారిన నటుడు సుహాస్. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజీ బ్యాండుతో రాగా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో కలిపి రూ.4.3 కోట్లు వసూలు చేసింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ముందు బూటుకట్ బాలరాజు, గేమ్ ఆన్, హ్యాపీ ఎండింగ్, కిస్మత్ కొట్టుకుపోయాయి.
గతంలో కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుహాస్ వరుసగా హ్యాట్రిక్ హిట్లు కొట్టేశాడు. సినిమాలో సుహాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మల్లి పాత్రలో సుహాస్ ఒదిగిపోయాడు.
నటిగా శరణ్యలోని కొత్త కోణాన్ని చూపించగా శరణ్య పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలిచింది. లక్ష్మి, మల్లిల ప్రేమకథను డిఫరెంట్గా ఎండ్ చేయడం ప్రేక్షకులను ఆకట్టుకుంది.