అక్కినేని నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేదు. సత్యం,గోదావరి,వంటి సినిమాలు తప్ప సుమంత్కు కెరీర్కు ఉపయోగపడే సినిమాలు ఏవీ రాలేదు.దీంతో కొంతకాలం గ్యాప్ తీసుకున్న సుమంత్, ఇటీవలే తన సెంకడ్ ఇన్నింగ్స్ను మొదలుపెట్టాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటు సినిమాలు తీస్తున్నాడు సుమంత్. ‘మళ్లీ రావా’ అంటూ క్యూట్ లవ్స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిసెంట్ హిట్ కొట్టాడు. ‘సుబ్రమణ్యపురం’ సినిమాతో పలకరించిన నుమంత్ ,తాజాగా తన మరో సినిమాను విడుదలకు రెడీ చేశాడు.
సుమంత్ నటించిన ‘ఇదం జగత్’ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఒక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. యాక్షన్ .. ఎమోషన్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిగానే ఈ ట్రైలర్ ఉంది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు సుమంత్. మరి ట్రైలర్తో మెప్పించిన సుమంత్ సినిమాతో మెప్పిస్తాడో లేదో చూడాలి.
- Advertisement -
ట్రైలర్ ఓకే ..మరి సినిమా సంగతి ఏంటీ?
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -