టాలీవుడ్ సినిమాలో దశాబ్ద కాలం పాటు తన కామెడీతో అందరినీ నవ్వించిన సునిల్.. ఆ తర్వాత హీరోగా చేసి రాణించలేకపోయాడు. ఇప్పటికే సునీల్ కు వరుసగా ఐదు ప్లాప్ లు వచ్చాయి. ఇప్పుడు ‘ఉంగరాల రాంబాబు’తో రాబోతున్నాడు. తన కామెడీ టైమింగుతో ఏదో నెట్టుకువస్తున్న సునీల్.. ఇప్పుడు మాత్రం కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాడటనే వార్తలు వస్తున్నాయి.
{loadmodule mod_custom,Side Ad 2}
ఈ మధ్య కాలంలో సునీల్ చేసిన ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమా రాగా.. అది అతని కెరీర్ లోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా ప్రభావం సునీల్ కొత్త సినిమా ఉంగరాల రాంబాబు పడింది. ఓనమాలు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి ఫీల్ గుడ్ మూవీస్ తీసిన క్రాంతి మాధవ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రాంబాబు మూవీ.. షూటింగ్ పనులు పూర్తయి చాలా కాలమైనా కానీ ఇంకా విడుదలకు నోచుకోలేదు. పరుచూరి ప్రసాద్ ఈ సినిమా పరవాలేదు అనే బడ్జెట్ లో నిర్మించినా కూడా.. బయ్యర్లు ఎవరు కొనడానికి రావటంలేదు. ఇప్పుడు సునిల్ మార్కెట్ పూర్తిగా డౌన్ కావడంతో నిర్మాతలు చెప్పిన మొత్తానికి బయ్యర్లు ఒప్పుకోకపోవడం అటుంచి.. అసలు ఆ పక్కకు కూడా రావటం లేదట.
{loadmodule mod_custom,Side Ad 1}
ఈ సినిమా వేసవి లో విడుదల చేద్దాం అనుకున్నారు కానీ అది వీలుపడలేదు. జూన్ లో నైనా విడుదల చేస్తారు అనుకుంటే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మరి సునిల్ ఈ సినిమాను ఎలా రిలీజ్ చేస్తాడు అనేది పెద్ద సమస్యే. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రిలీజ్ అవ్వడం పెద్ద కష్టం కాదు కానీ.. కాస్త గట్టిగా ప్రయత్నించాలి. ఏది ఏమైన హీరోగా తన కేరీర్ ను మొదలు పెట్టిన సునీల్ కు అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. ప్రస్తుతం సినిమాల విషయంలో సునీల్ పరిస్థితి అంతగా బాలేదని అంటున్నారు.
{youtube}mI-5zahokD4{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related
