ఒకప్పుడు బుల్లితెరపై తన నటనతో ప్రేక్షకులను అలరించిన సురేఖా వాణి తర్వాత సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి పని చేసిన సురేఖ మానియా ఇప్పుడు అంతగా లేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది. హీరోయిన్లకు కూడా లేని క్రేజ్ ఈ మధ్య కారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఎంజాయ్ చేస్తుంది. ఈమె సినిమాల కంటే కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటుంది.
తన కూతురితో కలిసి పొట్టి బట్టలలో రచ్చ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తల్లి, కూతుళ్ళు ఇద్దరు కలిసి పోటాపోటీగా గ్లామర్ షో చేయడం ఫ్యాన్స్కు మంచి థ్రిల్ కలిగిస్తుంది. సుప్రిత ఇప్పటికే కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్, కొన్ని యాడ్స్లో నటించింది. ఈ అమ్మడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తాజాగా న తల్లిపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సీరియస్గా రియాక్ట్ అయింది సుప్రిత.
నిజానిజాలు తెలుసుకోకుండా యిష్టమొచ్చినట్లు రాసేదాన్ని జర్నలిజం అనిపించుకోదంటూ మీడియాపై కూడా కస్సుబుస్సులాడింది సుప్రిత. సుప్రిత ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుందిప్పుడు. ఆదాయం, డబ్బుల కోసం వేరేవారి పరువు, ప్రతిష్ట దెబ్బతీస్తున్న మీరు జర్నలిస్ట్లు, ప్రైమ్ న్యూస్ ఛానెల్స్ అని చెప్పుకోవడం మానేయడం అంటూ కస్సు బుస్సుమంది. సుప్రిత కోపానికి అసలు కారణం ఏంటనేది పూర్తిగా తెలియదు. కాగా, ఇటీవల సురేఖ వాణి రెండో పెళ్లిపై పలు ప్రచారాలు జరగగా, వాటిని ఖండించింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రవిశాస్త్రి!