టీమ్ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కొవిడ్ టీకా తొలి డోసును తీసుకున్నాడు. అహ్మదాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించుకున్నాడు. మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో మొదటి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.
కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నా. మహమ్మారిపై పోరులో భారత్ ను మరింత శక్తిమంతంగా మార్చిన అద్భుతమై వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు. అహ్మదాబాద్ అపోలోలోని కాంతాబెన్ ఆమె సిబ్బంది.. కరోనా వ్యాక్సినేషన్ ను ముందుకు తీసుకెళ్తున్న తీరు చాలా చాలా బాగుంది. వారి పనితీరు మెచ్చుకోదగినదిగా ఉంది’’ అని ఆయన ట్వీట్ చేశారు. టీకా తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు.
కరోనాతో పోరులో వైద్యులు, శాస్త్రవేత్తల ఘనతను కొనియాడారు. ఈ సందర్భంగా కరోనాకు వ్యతిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టులకు అతడు కృతజ్ఞతలు తెలిపాడు. 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీతోపాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు.
మాల్దీవులలో పిచ్చెక్కిస్తున్న బిపాసా అందాలు!