బాలీవుడ్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. విరాట్-అనుష్క శర్మల వివాహం తర్వాత ఇప్పుడు సోనమ్కపూర్, ఆనంద్ అహూజాలు పెళ్లి చేసుకోబోతున్నారు. రణవీర్, దీపికా ప్రేమలో మునిగి తేలుతున్నారు. తాజాగా మరో జంట పెళ్లిపీటలెక్కనుందనే వార్తలు బాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా…! తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 1 నేనొక్కడినే చిత్రం విజయం సాధించకపోయినా కృతి సనన్ కు మంచి గుర్తింపు తీసుకుని వచ్చింది. ఆ తరువాత ఈ భామ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. అయితే అక్కడా ఆమెజోరు ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, కృతి సనన్ మధ్య ఘాటు ప్రేమాయణం సాగుతోంది. ప్రేమ విషయాని వీరిద్దరూ ఇంతవరకు బయటపెట్టలేదు. వీరిద్దరూ త్వరలో వివాహానికి రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ జంటగా ‘రాబ్తా’ చిత్రంలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమించుకున్నారని గతంలో వదంతులు వినిపించాయి.
ఆదివారం రోజు కృతి సనన్ తన ఫ్యామిలీతో సుశాంత్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరి పెళ్లి గురించి చర్చించడానికే ఇరు కుటుంబ సభ్యులు కలసినట్లు బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా షో రూమ్ కృతి, సుశాంత్ కలసి వెళ్లడం కూడా పెళ్లి వార్తలు బలపడడానికి కారణం.