Thursday, April 25, 2024
- Advertisement -

త‌మ‌న్నారేటు ప‌దినిమిషాల‌కు అన్ని ల‌క్ష‌లా…?

- Advertisement -

మరి కొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌-2018 ఆరంభోత్సవ వేడుకలు కొద్ది క్ష‌ణాల్లో అట్ట‌హాసంగా ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్‌కు మంచి ఊపు తీసుకొచ్చేందుకు బాలీవుడ్ స్టార్స్ చిందేయ‌నున్నారు. సౌత్‌బ్యూటీ తమన్నా కూడా చిందేయనుంది. పదినిమిషాల ప్రదర్శనకు ఈ అమ్మడు ఏకంగా 50 లక్షల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ముంబైలోని వాంఖడే మైదానంలో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో తమన్నాతో కలిసి డ్యాన్సింగ్ మ్యాస్ట్రో ప్రభుదేవా ప్రేక్షకులను అలరించనున్నాడు. నాలుగు దక్షిణాది పాటల్లో చిందేసే వీరి నృత్యాన్ని శైమక్‌ దేవర్‌ కొరియోగ్రఫి చేసినట్లు సమాచారం.

తొలిసారి క్రీడా ఈవెంట్‌లో ప్రదర్శన చేస్తున్నానని సంబరపడిపోయింది. ఇంతకముందు ఇలాంటి వేడుకల్లో ఎప్పుడు పాల్గొనలేదని, ఐపీఎల్‌ వంటి అద్భుతమైన టోర్నీకి అవకాశం రావడం సంతోషంగా ఉందని ఈ మిల్కీబ్యూటీ చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటించడం వేరు స్టేడియంలో ప్రేక్షకుల ముందు చేయడం వేరని, మనమంతా పిచ్చిగా ఆరాధించే క్రికెట్‌ పండుగ ఈ రాత్రి మొదలవుతుందని ఆనందం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -