ఝమ్మంది నాధం చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ తాప్సి పొన్ను. తెలుగు లో పెద్దగా సక్సెస్ కాకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం మంచి హిట్స్ అందుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘రష్మీ రాకెట్’ అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాలో తాప్సీ అథ్లెట్ గా కనిపించనుండగా.. అందుకోసం కసరత్తులు చేస్తూ కష్టపడుతోంది.
ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ సినిమాల్లో పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ షో చేస్తూ హీరోయిన్గా రాణిస్తున్నావు తప్ప నీలో అంత ప్రత్యేకత ఏమీ లేదు. ఫాల్తు హీరోయిన్’ అంటూ కామెంట్ చేశాడు. దానికి వెంటనే తాప్సీ నెటిజన్ కి భలే కౌంటర్ ఇచ్చింది.
చూపించడం అంటే ఏంటి ..? నేను ఏం ఎత్తుకుని సినిమాలు చేస్తున్నాను. నా ఇమేజ్ ను పైకి ఎత్తుతున్నా. నీకు మాత్రం ఈ విషయం అర్థం కావడం లేదు” అని తాప్సి కామెంట్ పెట్టింది. 2016లో ‘పింక్’ చిత్రంలో నటించిన తరువాత బాలీవుడ్ మంచి అవకాశాలు వస్తున్నాయి.