రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్’సినిమా తీయడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేశాడు. వీళ్ల మధ్యలో నేనున్నాంటు వచ్చాడు దర్శక నిర్మాత కేతిరెడ్డి. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ టైటిల్లోనే లక్ష్మి పార్వతిని లక్ష్యంగా చేసుకుని సినిమా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా మీద లక్ష్మి పార్వతి కుడా బాగా వ్యతిరేకించారు.ఇప్పడు ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఈ సినిమాకు తెలుగుదేశం పార్టీ బ్యాకప్ ఉందన్న ప్రచారం మొదలైంది. అది శుద్ధ అబద్ధం అంటున్నాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తెలుగుదేశం వాళ్లు ఈ సినిమాలో పైసా కూడా పెట్టలేదని అతనన్నాడు.తెలుగుదేశం పార్టీ వాళ్లు కూడా ఈ సినిమాను వ్యతిరేకిస్తున్నారని కేతిరెడ్డి చెప్పాడు.తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గతంలో తాను ధర్నా కూడా చేశానని.. అలాంటిది ఆ పార్టీకి అనుకూలంగా సినిమా తీయడం.. వాళ్ల సాయం తీసుకోవడం ఎందుకు చేస్తానని కేతిరెడ్డి ప్రశ్నించాడు.చిత్రానికి రూ.3 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లు చెప్పాడు. జనవరిలో షూటింగ్ మొదలవుతుందని.. ఫిబ్రవరి నెలాఖరుకు సినిమా రిలీజవుతుందని ఆయన తెలిపాడు. ఇంకా ప్రధాన పాత్రలకు నటీనటులు ఖరారవ్వలేదని.. ప్రస్తుతం లక్ష్మీపార్వతి పాత్ర కోసం పూజా కుమార్.. ప్రియమణిలతో సంప్రదింపులు జరుపుతున్నామని.. ఎన్టీఆర్ పాత్రలో ఓ మరాఠీ రంగస్థల నటుడు కనిపించే అవకాశముందని కేతిరెడ్డి తెలిపాడు.