Wednesday, May 8, 2024
- Advertisement -

మెగా ఆఫర్​ కొట్టేసిన థమన్​..!

- Advertisement -

ఇప్పుడు టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్లు దేవిశ్రీ ప్రసాద్, థమన్​ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కొన్నేళ్ల కిందటి వరకు ఇద్దరి మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరిది పై చేయి అంటే దేవిశ్రీప్రసాద్ పేరే వినిపించేది. గతంలో అగ్ర హీరోల సినిమాలకు దేవిశ్రీప్రసాద్ ఎక్కువగా మ్యూజిక్ అందించేవాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అల వైకుంఠ పురములో మ్యూజికల్ హిట్ తో తమన్ కథే మారిపోయింది. ఆ తర్వాత వకీల్ సాబ్ సూపర్ హిట్ తో తమన్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు తమన్ అగ్రహీరోల హాట్ ఫేవరెట్ మారిపోయాడు.

తాజాగా తమన్ మెగాస్టార్ చిరంజీవి చిత్రానికి మ్యూజిక్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. చిరంజీవి 153 చిత్రమైన లూసిఫర్ రీమేక్ కు మ్యూజిక్​ డైరెక్టర్​గా థమన్​ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని థమన్​ స్వయంగా వెల్లడించాడు. ‘ చిరంజీవి గారి 153 చిత్రానికి నేను మ్యూజిక్​ డైరెక్టర్​గా చేస్తున్నాను’ అంటూ థమన్​ సోషల్ మీడియాలో ఓ పోస్ట్​ పెట్టాడు.

మెగాస్టార్​ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్​లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తికాగానే.. లూసిఫర్​ రీమేక్​లో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్​ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో కి రీమేక్​ చేయబోతున్నారు. తమిళ దర్శకుడు మోహన్​రాజా ఈ మూవీని డైరెక్ట్​ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్​ ఎవరు? షూటింగ్​ ఎప్పుడు ప్రారంభమవుతుంది? తదితర వివరాలు ఏవీ బయటకు రాలేదు.

Also Read

పవన్ ఫ్యాన్స్ ని ఊరిస్తున్న హరీష్ శంకర్..!

ఏకంగా మూడు సిమిమాలను రీమేక్ చేస్తున్న దిల్ రాజు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -