ముంబాయిలో యాక్షన్ సీన్స్తో నాగ్ బిజీ
ఒక్క సినిమా వారిద్దరికి బంపర్హిట్ చేసింది. ఒక్క సినిమాతో వీరిద్దరూ క్రేజీ కాంబినేషన్ అయ్యారు. వారిద్దరూ కలిసి దశాబ్దాల తర్వాత ఓ సినిమా చేస్తున్నారు. వారిద్దరే దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నటుడు అక్కినేని నాగార్జున. వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘శివ’.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి శివ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం నాగార్జునతో యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. మరోసారి వర్మ తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ కొనసాగుతుండగా అజయ్, షాయాజీ షిండేలతో నాగార్జున పోరాడుతున్నారు. బాలీవుడ్ ఫైట్ మాస్టర్ ఇజాజ్ షేక్ నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఇది పూర్తి కాగానే ఓ ఛేజింగ్ను తీస్తారు. మార్చి 30వ తేదీ వరకూ ముంబయిలోనే షూటింగ్ జరుగుతుందని సమాచారం.