- Advertisement -

జన నాయగన్‌..థియేటర్లు దొరికేనా?

- Advertisement -

విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమాకు సంబంధించిన తెలుగు విడుదలపై ఊహించని డిస్ట్రిబ్యూషన్ నిర్ణయం వెలువడింది. రాజకీయాల్లో పూర్తిగా ప్రవేశించే ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ఇదే కావడం విశేషం. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి ప్రత్యేకంగా 2026 జనవరి 9న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

తమిళ విడుదల విషయంలో ఎలాంటి సందేహం లేకపోయినా, తెలుగు వెర్షన్‌పై మాత్రం చాలా కాలంగా చర్చ నడిచింది. ‘జన నాయగన్’ చిత్రం తెలుగులో ‘జన్ నాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు అధికారిక రీమేక్. తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులపై నాగ వంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్) తప్పుకున్నారని, దిల్ రాజు రంగంలోకి వస్తారని పలు వదంతులు వినిపించాయి. అయితే ఇప్పుడు చిత్ర నిర్మాతలు ఈ ఊహాగానాలకు ముగింపు పలికారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ పంపిణీ చేయనుందని అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి సీజన్‌లో ఇప్పటికే పలు భారీ తెలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక అసలు సవాల్ స్క్రీన్‌ల కేటాయింపుపైనే ఉంది. పండుగ రద్దీ సమయంలో పోటీ తీవ్రంగా ఉండటంతో సింగిల్ స్క్రీన్లు, గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ప్రదర్శన కీలకంగా మారనుంది.

ఈ చిత్రంలో మమితా బైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -