ప్రముఖ రంగస్థల నటుడు ప్రకాష్రాజ్(82) కన్నుమూశారు. తిరుపతికి చెందిన ప్రకాశ్ రాజు నాటకరంగానికి ఐదు ధశాబ్దాలుగా ఎనలేని సేవలు చేశారు. అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి తదితర సినిమాల్లో కూడా ఆయన నటించారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు.
అశోక్ సామ్రాట్, రాణా ప్రతాప్, పృధ్వీరాజ్, చాణక్య చంద్రగుప్త, విశ్వనాథ నాయకుడు, లేపాక్షి, అక్భర్ అంతిమ ఘడియలు నాటకాలు ఆయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. 1977లో భవాని కళానికేతన్ నాటక సంస్థను ఏర్పాటు చేసి కళాకారులను ప్రోత్సహించారు. జిల్లాలోని కళాకారుల్లో ఎక్కువ శాతం మంది ఆయన దగ్గర శిక్షణ తీసుకున్నవారే.
ప్రకాశ్ రాజు కి రియల్ హీరో, రంగస్థలి రారాజు, నాటక దర్శకరత్న బిరుదులు అందుకున్నారు. ప్రకాష్రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మృతికి రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, పలువురు కళాకారులు నివాళులర్పించారు.
కొరటాలను టార్గెట్ చేసిన ఆ బడా నిర్మాత.. ఆచార్యకు కష్టాలు తప్పవా?