Monday, April 29, 2024
- Advertisement -

ఆక్సిజన్ అందక తల్లిని కోల్పోయిన టాలీవుడ్ డైరెక్టర్

- Advertisement -

దేశంలో కరోనా కేసులు ఎంత బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎటు చూసినా కరోనా కేసులు.. మరణాలే కనిపిస్తున్నాయి. కరోనా సామాన్యులకు మాత్రమే కాదు సెలబ్రెటీలు తలనొప్పిగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లో పలు విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది.

హీరో సాయి ధరమ్ తేజ్ దర్శకుడు సుబ్బు తల్లి మృతి చెందారు. ఈ మద్యనే టాలీవుడ్ దర్శకుడు సుబ్బు తల్లి మంగమ్మ కరోనా బారినపడగా, ఆమెకు సకాలంలో ఐసీయూ బెడ్ దొరక్క మృత్యువాతపడ్డారు. ఒక ఐసీయూ బెడ్ కోసం దర్శకుడు సుబ్బు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో మంగమ్మ అత్యంత బాధాకర పరిస్థితుల్లో కన్నుమూశారు.

ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఎంతగా ట్రై చేసినా.. సుబ్బు మదర్‌ని కాపాడుకోలేకపోయాం’ అంటూ సాయి ధరమ్ పోస్ట్ చేశారు. తన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్ర దర్శకుడు సుబ్బు తల్లిగారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ సమయంలో సుబ్బు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఆయన ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు సుబ్బు తల్లి మృతిపై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

సాయి ధరమ్ తేజ్ క్షమాపణ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -