టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో వివాదానికి తెర లేప్పింది.టాలీవుడ్లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసింది శ్రీరెడ్డి.తనకు మెంబర్షిప్ ఇవ్వలేదని ఫిలించాంబర్ ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేసి తీవ్ర దూమారం రేపింది.ఇక అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వాడుకున్నాడని నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు దగ్గుబాటి అభిరామ్పై సంచలన ఆరోపణలు చేసింది.
టాలీవుడ్లో కాస్టింట్ కౌచ్ ఉద్యమం తీవ్ర దశలో ఉన్నప్పుడు నటుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్,వాళ్ల అమ్మగారిపై అనుచిత వాఖ్యలు చేసి తీవ్ర విమర్శల పాలైంది.అప్పటి నుండి శ్రీరెడ్డిని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.దీంతో ఫేస్బుక్లో తన ఇష్టం వచ్చినట్లు పోస్ట్లు పెడుతు కాలం గడుపుతుంది.గత కొన్ని రోజులుగా న్యాచురల్ స్టార్ నానిపై వివాస్పద కామెంట్స్ చేస్తు వస్తుంది.నాని నన్ను లైంగికంగా వాడుకున్నాడని,అతను అనుకున్నంత మంచివాడు కాదని ,నన్ను బిగ్ బాస్లోకి రానివ్వకుండా నాని అడ్డుకున్నాడని చెప్పుకొచ్చింది.
అయితే శ్రీరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక టాలీవుడ్ పెద్ద ఉన్నాడని తెలుస్తుంది.శ్రీరెడ్డికి మద్ధతుగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండు రోజులు క్రితం మీడియా ఎదుట మాట్లాడిన సంగతి తెలిసిందే.నేను ఆ సమయంలో ఇండియాలో లేను.జరిగింది చాలా తప్పు,మా గురువు గారు ఉంటే ఇలా జరిగేది కాదని మోహన్ బాబు వ్యాఖ్యనించారు.మోహన్ బాబు తనకు అండగా మాట్లాడటంతో శ్రీరెడ్డి మరింత రెచ్చిపోయి తన ఫేస్బుక్లో వివాస్పద పోస్ట్లు పెడుతుంది.ఇది ఇలా ఉంటే నాని శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై లీగల్ నోటిస్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు.అటు శ్రీరెడ్డి కూడా నాకు అదే కావాలి అంటు కామెంట్స్ చేసింది.మరి ఈ వ్యవహరం ఎక్కడికి వెళ్తుందో చూడాలి.