Sunday, May 19, 2024
- Advertisement -

ఆ నలుగురికి అర్జెంట్ గా హిట్ పడాలి లేదంటే…

- Advertisement -

వారందరూ టాలీవుడ్ టాప్ డైరెక్టర్లే..వరుస సక్సెస్ లతో సూపర్ ఫార్మ్ ను కంటిన్యూ చేశారు. అయితే గత కొంతకాలంగా వారికి సక్సెస్ అనేది లేకుండా పోయింది.

ఇపుడు వాళ్లంతా మాంచి హిట్ కోసం ఎదురు చూస్తూ… మన ముందుకు ఎక్స్ ట్రాల్లేకుండా… మర్యాదగా వస్తున్నారు. అలా వచ్చి ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టి… మళ్లీ ట్రాక్ లోకి వద్దామనుకుంటున్నారు. ఇంతకీ ఆ దర్శక దిగ్గజాలెవరో తెలుసా..ఇంకెవరు శ్రీనువైట్ల,హరీష్ శంకర్ ,దేవకట్టా,మారుతీలు. వీరంతా హిట్ కోసం ఎంతగానో తాపత్రయపడుతున్నవారు. బ్రూస్ లీ తో శ్రీనువైట్లకు కచ్చితంగా హిట్ పడాలి. లేదంటే పొజిషన్ పోతోంది.ఇక హరీష్ శంకర్ అంటారా..? రభస తీసి ఇండస్ట్రీకి ఎంత దూరమయ్యాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గబ్బర్ తో వచ్చిన తిక్కంతా దెబ్బకు తుడిసిపెట్టుకుపోయింది. 

అందుకే ఇపుడు సుబ్రహ్మణ్యాన్ని సేల్ చేయడానికి వస్తున్నాడు. అది సేల్ కాకపోతే మాత్రం… మనోడికి షేవ్ అయిపోతోంది. ఇక దేవ కట్టా మ్యాటర్ కొస్తే…అతడిలో మ్యాటర్ ఉన్నా…ఆటోనగర్ దెబ్బకు అడ్రస్ గల్లంతైనంత పనైంది.అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ డైనమైట్ పేల్చడానికి వస్తున్నాడు. మారుతి అంటారా ఇక చెప్పేదేముంది చెప్పండి. బూతును పక్కన పెట్టి..భలే భలే మగాడివోయ్ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తానంటున్నాడు. ఏది ఏమైతేనే త్వరలో వస్తోన్న ఈనలుగురు దర్శకులకు హిట్ పడాలి. లేదంటే జనాలు వీరిని మర్చిపోయినా మర్చిపోతారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -