Thursday, May 9, 2024
- Advertisement -

మ‌హేష్ 25వ సినిమా లొకేషన్స్ వేటలో వంశీ

- Advertisement -

డీవీవీ దానయ్య నిర్మాత‌గా కొర‌టాల‌- మ‌హేష్ బాబు కాంబినేష‌ణ్‌లో వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేను సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్స‌న్‌ల‌ను కుర‌పించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నది. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా విజ‌య‌వంతం కావ‌డంతో ఫుల్ ఖుషీ అవుతున్నాడు. ఇప్పుడు తన 25వ సినిమాకోసం సిద్ద‌మ‌వుతున్నారు.

మ‌హేష్ త‌న 25 వ సినిమా కు వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా వున్నాడు. కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరగనుంది. అందువలన వంశీ పైడిపల్లి లొకేషన్స్ వేటలో వున్నాడు.

ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.యు. మోహనన్ కలిసి లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నారు. అలా వాళ్లు న్యూయార్క్ లో వున్నప్పటి ఫోటోను వంశీ పైడిపల్లి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. త‌న 25 వ‌సినిమాలో మ‌హేష్‌ను వంశీ పైడిపల్లి ఎలా చూపిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -